తెలంగాణ

telangana

వాలంటీర్ ఆత్మహత్యాయత్నం.. ఇళ్ల స్థలాల్లో అక్రమాలే కారణం!

ఇళ్ల స్థలాల్లో అవినీతి కారణంగా చిత్తూరు జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అయితే వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది.

By

Published : Jul 1, 2020, 1:01 PM IST

Published : Jul 1, 2020, 1:01 PM IST

volunteer suicide attempt
volunteer suicide attempt

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తస్​మున్నీసా అనే గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. తహసీల్దార్ కార్యాలయం పైనుంచి దూకింది. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలు తస్​మున్నీసా బి.కొత్తకోట బీసీ కాలనీలో వాలంటీర్​గా విధులు నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుంచి సమాధానం లేకపోవడం, ప్రతిపాదిత లబ్ధిదారులు ప్రశ్నిస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం.

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details