తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆడపిల్లలు పుట్టారని.. అదనపు కట్నం కోసం వేధింపులు - women harassed after girl child birth

సాఫ్ట్​వేర్ ఉద్యోగమని చెప్పి రూ.10 లక్షల కట్నం, బంగారం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆడబిడ్డ పుట్టగానే అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. మరోసారీ ఆడపిల్లే జన్మించిందని భార్యను వదిలేసి మరో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన దారి నుంచి తప్పుకోవాలంటూ ఫోన్​కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ ప్రబుద్ధుడి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

women harassed by husband and his family after girl child birth
ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు

By

Published : Jan 11, 2021, 5:16 PM IST

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన లావణ్యకు తూప్రాన్​కు చెందిన సంతోశ్​తో 2016లో వివాహం జరిగింది. కట్నం కింద సంతోశ్​కు రూ.10 లక్షలు, బంగారం ఇచ్చారు. సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్న సంతోశ్ అసలు భాగోతం వివాహం తర్వాత బయటపడింది.

మొదటికాన్పులో ఆడపిల్ల పుట్టిందని రూ.5 లక్షలు తీసుకువస్తేనే ఇంట్లోకి రానిస్తామని భర్తతో పాటు అత్తమామలు, మరిది వేధించడం వల్ల లావణ్య తల్లిదండ్రులు అంత మొత్తం ముట్టజెప్పి ఆమెను అత్తింటికి పంపించారు. రెండోసారీ అమ్మాయే పుట్టిందని రూ.15 లక్షల రూపాయలు తీసుకురావాలని మరోసారి వేధించారని లావణ్య వాపోయింది. డబ్బు ఇవ్వలేదని తనను ఇంట్లో నుంచి పంపించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది.

సంతోశ్​పై జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సరిగ్గా స్పందించలేదని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనలా ఇంకెవరూ మోసపోకూడదని తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

ABOUT THE AUTHOR

...view details