బతుకమ్మ ఆడి పాడిన అనంతరం ఇంటికి చేరుకునే క్రమంలో పందిరి వరలక్ష్మి (30) గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట గ్రామంలో జరిగింది. పండుగ రోజు ఆ ఇంటితో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు నెలకొన్నాయి.
విషాదం: ఆమెకిదే చివరి బతుకమ్మ అయ్యింది... - bathukamma celabrations women died
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా ముందు మహిళలు అత్యంత వైభవంగా బతుకమ్మ పండగ జరుపుకుంటారు. అందరి ఇళ్లలో సంతోషాలు నింపితే మేడ్చల్ జిల్లా నిజాంపేట గ్రామంలో మాత్రం విషాదాన్ని మిగిల్చింది.
![విషాదం: ఆమెకిదే చివరి బతుకమ్మ అయ్యింది... women died with heart attack after bathukamma celabrations atnizam peta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9204645-526-9204645-1602895939328.jpg)
విషాదం: ఆమెకిదే చివరి బతుకమ్మ అయ్యింది
ఉదయం నుంచి ఎంతో భక్తితో బతుకమ్మలను పేర్చింది. సాయంత్రం పూట అందరితో కలిసి బతుకమ్మ ఆడి పాడింది. గుండెపోటు రావడంతో ఆమెకు అదే చివరి బతుకమ్మ అయింది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కంటనీరు పెట్టించింది. వరలక్ష్మికి ఒక బాబు, పాప ఉన్నారు.
ఇదీ చూడండి: నీట్లో తెలుగు విద్యార్థుల సత్తా.. హైదరాబాద్ విద్యార్థినికి మూడో ర్యాంక్