తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై! - తెలంగాణ వార్తలు

వారం రోజుల కిందట ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు అనుమానస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

woman-suspected-death-at-shakhapalli-bellampalli-mandal-in-mancherial
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై!

By

Published : Jan 20, 2021, 10:48 AM IST

వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖపల్లి గ్రామానికి చెందిన దుర్గం మహేశ్వరి ఈనెల 14న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులు వెతికినా ఆచూకీ లేకపోవడం వల్ల ఈనెల 16న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్​లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. యువతి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:గంగపుత్రులకు క్షమాపణ చెప్పడానికి సిద్ధమే: తలసాని

ABOUT THE AUTHOR

...view details