వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖపల్లి గ్రామానికి చెందిన దుర్గం మహేశ్వరి ఈనెల 14న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులు వెతికినా ఆచూకీ లేకపోవడం వల్ల ఈనెల 16న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై! - తెలంగాణ వార్తలు
వారం రోజుల కిందట ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు అనుమానస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై! woman-suspected-death-at-shakhapalli-bellampalli-mandal-in-mancherial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10307285-thumbnail-3x2-dead---copy.jpg)
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై!
మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. యువతి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.