తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2021, 5:02 AM IST

ETV Bharat / jagte-raho

వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి

వైద్యుల నిర్లక్ష్యం.. ఈ లోకాన్ని చూడాల్సిన ఆ పసికందుకు శాపమైంది. రెండు కాన్సుల తర్వాత మూడో కాన్పు కోసం వచ్చిన ఆ తల్లికి కడుపు కోత మిగిల్చింది. వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా నిలుస్తాడనుకున్న తండ్రికి కన్నీరే మిగిల్చింది. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

With the negligence of the doctors the baby died in jogulamba gadwal district
వైద్యుల నిర్లక్ష్యంతో.. శిశువు మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో.. ఓ పసికందు పురిటిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రానికి చెందిన పద్మమ్మ, భర్త తిమ్మప్పలకు ఇద్దరు ఆడ పిల్లలు. వారు మూడో కాన్పు కోసం ఈ నెల 2న గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ప్రసవానికి ఇంకా సమయం ఉందని.. ఈ నెల 10న రావాలని వైద్యులు చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు.

ఎముకలు విరిగి ఉబ్బిపోయింది..

నాలుగు రోజుల తర్వాత పద్మమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 7న జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. పురిటి నొప్పులు ఎక్కువైనప్పటికీ.. అక్కడ డాక్టర్లు ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో ఇదేమిటని ప్రశ్నించారు. పరిస్థితి తీవ్రంగా మారటంతో సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో శిశువు చేతిని లాగడంతో ఎముకలు విరిగి ఉబ్బిపోయింది. కంగారు పడ్డ వైద్యులు రాత్రికి రాత్రి హుటాహుటిన ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అప్పటి వరకు కడుపులో శిశువు బాగానే ఉందని కుటుంబీకులకు తెలిపిన వైద్యులు.. మగ బిడ్డ పుట్టాడు కానీ అప్పటికే బిడ్డ చనిపోయిందని తెలపడంతో బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ చనిపోయినట్లు శిశువు తండ్రి వాపోతున్నాడు.

' విధుల్లో ఉన్న వైద్యులు సాధారణ ప్రసవానికి ప్రయత్నించారు. శిశువు మెడ చుట్టు పేగు చుట్టుకోవడంతో ఆపరేషన్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. అంతలోపే ఆలస్యం కావడంతో శిశువు చనిపోయింది. ఇందులో వైద్యుల నిరక్ష్యమేమి లేదు.'

---- డా. శోభారాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్

ఇదీ చదవండి:మొదటిసారి వర్చువల్​గా 18వ బయో ఆసియా సదస్సు

ABOUT THE AUTHOR

...view details