తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 11:03 AM IST

ETV Bharat / jagte-raho

మొబైల్​ కొట్టేశాడు.. సిమ్​కార్డు వేసి దొరికిపోయాడు

కరోనా ప్రభావంతో ఆరు నెలల పాటు ఇంట్లోనే ఉంటున్నాడు. చేతిలో డబ్బులు అయిపోయాయి. పనీపాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావంటూ తండ్రి మందలించాడు. ఏం చేసైనా సరే.. డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఓ యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. పట్టణంలోని ఓ మొబైల్​ దుకాణంలో ఆరు ఫోన్లు దొంగిలించి రెండు నెలలు కూడా తిరక్కుండానే దొరికిపోయిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Wanaparthy Police Arrest Mobile Thief
మొబైల్​ కొట్టేశాడు.. సిమ్​కార్డు వేసి దొరికిపోయాడు

వనపర్తి జిల్లా కేంద్రంలో మహేష్​ అనే యువకుడు మొబైల్ దుకాణం పెట్టి ఉపాధి పొందుతున్నాడు. ఆగష్టు 20న తన షాపులో రూ.74 వేలు విలువ చేసే ఆరు మొబైల్​ ఫోన్లు పోయినట్టు గుర్తించాడు. వెంటనే వనపర్తి పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దొంగతనం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మొబైల్​ ఐఎంఈఐ నెంబరు నమోదు చేసుకొని పోయిన ఫోన్ల మీద నిఘా పెట్టారు.

రెండు రోజుల క్రితం పోయిన ఫోన్లలో ఒక ఫోన్​ ఆన్​ చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే విచారణ చేపట్టిన పోలీసులు పడమటి తండాకు చెందిన సాగర్​ అనే యువకుడు ఆ మొబైల్​ వాడుతున్నట్టు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి సాగర్​ను విచారించగా.. ఆరు మొబైల్​ ఫోన్లు తనే దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. కరోనా వల్ల కాలేజీకి వెళ్లడం లేదని... ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల తండ్రి మందలించాడని.. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో మొబైల్స్​ దొంగతనం చేసినట్టు పోలీసులు తెలిపారు. సాగర్​ను అదుపులోకి తీసుకొని దొంగతనం కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:విద్యార్థుల ఎంపికను తాత్కాలికంగా నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details