తెలంగాణ

telangana

By

Published : Oct 23, 2020, 5:41 PM IST

ETV Bharat / jagte-raho

క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి

ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి
క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి

ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న ఓ క్వారీలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కొంత కాలంగా గ్రామానికి చెందిన పలువురు బాలురు ఈ క్వారీలో ఈతకు దిగుతున్నారని స్థానికులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లిన కొంత మంది బాలురు అందులోకి దిగగా.. నీల కాయల బాలాజీ(12), పొడుగు గిరీశ్​(11), నందనవనం శరత్ చంద్ర(12) అనే ముగ్గురు బాలురు మృతి చెందారు. పిల్లల మరణంతో తల్లిద్రండులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details