తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రాయపోల్​ పోలీస్​ స్టేషన్​ ముందు గ్రామస్థుల ఆందోళన - siddipeta latest news

పోలీసులు కొట్టడం వల్లే తమ ఊరి వ్యక్తి మృతి చెందాడంటూ సిద్దిపేట జిల్లా రాయపోల్​ మండల కేంద్రంలో స్థానిక పోలీస్​ స్టేషన్ ముందు గ్రామస్థులు బైఠాయించారు. పెద్ద ఎత్తున తరలొచ్చి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో అదనపు బలగాలను మోహరించారు.

villagers protest in front of rayapal police station for justice in siddipeta distritct
రాయపోల్​ పోలీస్​ స్టేషన్​ ముందు గ్రామస్థుల ఆందోళన

By

Published : Jun 26, 2020, 3:45 PM IST

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తిప్పర్తి గౌరయ్యకు, మరో వ్యక్తికి గొడవ జరుగుతుండగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గౌరయ్య కింద పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ కొట్టడం వల్లే గౌరయ్య మృతిచెందాడంటూ గ్రామస్థులు స్టేషన్​ ముందు బైఠాయించారు. పెద్ద ఎత్తున తరలొచ్చి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గజ్వేల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

రాయపోల్​ పోలీస్​ స్టేషన్​ ముందు గ్రామస్థుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details