తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంటి నుంచి వెళ్లిన యువకులు విగతజీవులై తేలారు - nizamabad news

శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు యువకులు విగతజీవులై తేలారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్​ జిల్లా నవీపేట మండలంలోని అలీసాగర్​ కాలువలో చోటుచేసుకుంది.

two young men died in alisagar river
two young men died in alisagar river

By

Published : Aug 23, 2020, 3:15 PM IST

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం భరత్ నగర్ తండా సమీపంలోని అలీసాగర్ కాలువలో పడి ఇద్దరు యువకులు మరణించారు. ఫకీరాబాద్​కు చెందిన శ్రీకాంత్(18), గణేష్ (19) ఇద్దరు కలిసి శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లగా... ఈరోజు అలీసాగర్ కాలువలో విగతజీవులై తేలారు. విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

ABOUT THE AUTHOR

...view details