నారాయణపేట జిల్లా కొండారెడ్డిపల్లిలో ఇద్దరు యువకులు కాలక్షేపం కోసం చెరువు వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు నీటిలో దిగగా... ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు.
కొండారెడ్డిపల్లి చెరువులో ఇద్దరు యువకుల గల్లంతు
చెరువులో ఈత వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన నారాయణపేట జిల్లా కొండరెడ్డిపల్లిలో జరిగింది. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కొండారెడ్డిపల్లి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు
రాత్రి వరకు ఇరువురు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు గాలిస్తూ చెరువు వద్దకు వెళ్లారు. ఇక్కడ యువకులు తీసుకువచ్చిన వాహనం కనిపించటంతో నీటిలో మునిగిపోయారని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి:హరితవనంగా గ్రేటర్ హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్
Last Updated : Aug 28, 2020, 6:33 PM IST