తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు - ఎలుగదాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు

ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలైన ఘటన కామారెడ్డి జిల్లా సంతాయిపేట్ లో చోటుచేసుకుంది. బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు
ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు

By

Published : Sep 3, 2020, 6:29 PM IST

కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం సంతాయిపేట్ వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేసుకుంటున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన మద్దికుంట ప్రభు, అతని తండ్రి రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details