తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2020, 8:53 AM IST

ETV Bharat / jagte-raho

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. ముమ్మరంగా గాలింపు

పెద్దమ్మగడ్డకు చెందిన వెంకటేశ్​(10)రాజీద్(17) కాకతీయ కెనాల్​లోకి సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం వేగంగా ఉన్నందున కొట్టుకుపోయారు. కట్టపై దొరికిన దుస్తుల ఆధారంగా కెనాల్​ వెంబడి పోలీసులు గాలింపు చేపట్టారు.

Kakatiya canal
ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ గల్లంతు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. నగరంలోని పెద్దమ్మగడ్డకు చెందిన వెంకటేశ్​(10)రాజీద్(17) కాకతీయ కెనాల్​లోకి సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లారు. బట్టలు కట్టపై కెనాల్​లోకి దిగారు. నీటి ప్రవాహం వేగంగా ఉన్నందున కొట్టుకుపోయారు.

సాయంత్రం వెళ్లిన విద్యార్థులు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి కెనాల్ వెంబడి గాలించారు. ఇరువురి బట్టలు కట్టపై ఉన్నందున కెనాల్​లో కొట్టుకుపోయారని తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కెనాల్ వెంబడి గాలిస్తున్నారు.

ఇవీ చూడండి:కూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details