తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2021, 9:16 AM IST

ETV Bharat / jagte-raho

శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంతలోకాలకు..

ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా... వారు ప్రయాణిస్తున్న బైక్​ రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లు సమీపంలోని బుగ్గవాగు వద్ద చోటు చేసుకుంది.

two persons died in road accident to hit the tree in khammam district
శుభాకార్యానికి వెళ్లి వస్తూ... సుదూర లోకాలకు

వివాహవేడుకకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లు సమీపంలోని బుగ్గవాగు వద్ద బైకు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు.

మృతులు పండితాపురం గ్రామానికి చెందిన అరిపిన్ని వెంకటేశ్​(23), కానుగల సాయి(22)గా పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్​లోని శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. నూతన ఏడాది మొదటి రోజే ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారణమైతే పదేళ్ల జైలు!

ABOUT THE AUTHOR

...view details