తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2020, 5:13 PM IST

ETV Bharat / jagte-raho

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. తండ్రీ కొడుకుల మృతి

ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగార్జునసాగర్ రోడ్డుపై తమ్మలోనిగూడ గేట్​ సమీపంలో ప్రమాదం జరిగింది.

two-persons-died-and-one-injured-in-road-accident-in-rangareddy-dist
ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తండ్రికుమారులు మృతి....ఒకరికి గాయాలు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడ గేట్​ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

యాచారం మండలం నానక్​నగర్​ గ్రామానికి చెందిన తండ్రికుమారులు తాండ్ర జంగయ్య(55), తాండ్ర రమేశ్(30) మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:భార్యను హతమార్చి.. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు...

ABOUT THE AUTHOR

...view details