జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాంబాగ్వాడలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని పట్టణ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు, పంజాబద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్ - జగిత్యాలలో బెట్టింగ్ వార్తలు
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాంబాగ్వాడలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, రూ. 15,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి 15,500 రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.