రుణ యాప్ల కేసులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి కేంద్రంగా రుణ యాప్లు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితులు హి జియాన్ (చైనా), వివేక్కుమార్ (యూపీ)గా గుర్తించారు. వారి నుంచి 4 ల్యాప్టాప్లు, 2 చరవాణులను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు దర్యాప్తులో హి జియాన్ ప్రధాన సూత్రధారిగా తేలిందని సీపీ తెలిపారు. వ్యాపార వీసాపై 2019లో హి జియాన్ భారత్ వచ్చినట్లు చెప్పారు. పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రుణ యాప్లు రూపొందించి సూక్ష్మ రుణాలు ఇస్తున్నట్లు వివరించారు.