తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మేకలు మేపేందుకు వెళ్లి.. ఇద్దరు గల్లంతు - sangareddy crime news

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్​ మండలం రేజింతల్​లో విషాదం నెలకొంది. మేకలు కాసేందుకు వెళ్లి.. చెక్​డ్యాం సాజిద్, రాకేష్ గల్లంతయ్యారు. సాజిద్‌ మృతదేహాన్ని లభించగా.. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

sangareddy crime news
మేకలు మేపేందుకు వెళ్లి.. ఇద్దరు గల్లంతు

By

Published : Nov 14, 2020, 8:30 PM IST

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్‌లో పండగపూట విషాదం నెలకొంది. మేకలు కాసేందుకు వెళ్లి చెక్‌డ్యాంలో ఇద్దరు గల్లంతయ్యారు. సాజిద్, రాకేష్ శుక్రవారం మేకలు మేపేందుకు వెళ్లి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.

ఉదయం.. గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్ మృతదేహం లభ్యం కావడం వల్ల రాకేష్ కోసం సాయంత్రం వరకు వెతికారు. చీకటి పడడం వల్ల ఆదివారం గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. సాజిద్‌ మృతదేహాన్ని జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇవీచూడండి:విషాదం: కారును ఢీకొన్న ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details