సీమంతానికి వెళ్తుండగా ప్రమాదం.. గర్భిణీ మృతి - kamareddy accident
![సీమంతానికి వెళ్తుండగా ప్రమాదం.. గర్భిణీ మృతి kamareddy road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6827275-913-6827275-1587114166196.jpg)
13:25 April 17
రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓమ్ని వాహనం , బైక్ ఢీకొని ఐదు నెలల గర్భిణీ సహా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దోమకొండ మండలం సీతారాం పల్లి గ్రామానికి చెందిన శ్రావణి... సీమంతం కోసం తమ్ముడు సాగర్తో కలిసి ఓమ్ని వాహనంలో గండివేట్ గ్రామానికి బయలుదేరింది.
గుడిమేట్ వద్ద ఓమ్మి, ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టండంతో శ్రావణి... ద్విచక్ర వాహనం నడుపుతున్న ఒల్లెపు వీర నారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికీ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.