యాదాద్రి భువనగిరిజిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ఢీకొని నుజ్జయ్యాయి. బీబీనగర్ కి చెందిన ఓ వ్యక్తి తలకి గాయాలయ్యాయి. మరో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.