తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2020, 7:50 PM IST

ETV Bharat / jagte-raho

ఆ ఊర్లో భయం..భయం.. పులి దాడిలో పశువు హతం..

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచరిస్తోంది. తాజాగా పిప్పల్​ కోటి శివారులో పశువును పులి హతమార్చింది. దీనితో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.

Tiger wandering in Bhimpur, Adilabad District
మళ్లీ ఆ ఊర్లో భయం.. భయం.. పులి దాడిలో పశువు హతం..

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. పిప్పల్ కోటి శివారులో పులి పశువును హతమార్చిన ఘటన తాజాగా వెలుగు చూసింది. హతమైన పశువు గ్రామానికి చెందిన దాసరి రమేశ్​కి చెందినదిగా గుర్తించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారి గీరయ్య పశువు.. పులి దాడిలో మృతి చెందినట్లు నిర్ధారించారు. పక్షం రోజుల కిందట పులి వరుస దాడుల్లో తాంసి, అంతర్గావ్, కరంజి శివారులో పశువులు మృత్యువాత పడగా.. ఆ తర్వాత పులి కదలికలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజా ఘటన అందరిలో మళ్లీ భయాన్ని రేకెత్తిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details