తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2020, 10:06 AM IST

ETV Bharat / jagte-raho

భద్రాద్రి జిల్లాలో పులి కలకలం.. ఆవుదూడపై దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం సమీపంలోని గుండ్లమడుగు అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున ఆవుదూడపై దాడి చేసిన పులి.. రైతుల కేకలతో పారిపోయింది.

tiger attacked on a calf in Kothagudem District
భద్రాద్రి జిల్లాలో పులి కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం సమీపంలో పులి సంచారం కలకలం సృష్టించింది. వైల్డ్​లైఫ్ పరిధిలోని గుండ్లమడుగు అటవీ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి పులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

భద్రాద్రి జిల్లాలో పులి కలకలం

సోమవారం తెల్లవారుజామున ఆవుదూడపై పులి దాడి చేసిందని, తాము కేకలు వేయడం వల్ల దూడను వదిలి పారిపోయిందని రాత్రి కాపలాకు వెళ్లిన రైతులు వెల్లడించారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. పులిదాడిలో ఆవుదూడ స్వల్పంగా గాయపడినట్లు గుర్తించారు.

భద్రాద్రి జిల్లాలో పులి కలకలం

ABOUT THE AUTHOR

...view details