ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మావయిస్టులు మృతి చెందారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి - ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ జిల్లా కాంకేర్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల... పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా... ఓ ఎస్ఎస్బీ జవాన్కు గాయాలయ్యాయి.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
కోసరోడ్లోని ఎస్ఎస్బీ క్యాంపు వద్ద కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జవాన్కు గాయాలయ్యాయి. మృతదేహలతోపాటు, ఆరు ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను కాంకేర్ జిల్లా ఎస్పీ గోరక్ నాద్ బగేల్ ధ్రవీకరించారు.
ఇదీ చూడండి:కొవాగ్జిన్ సమర్థత 60 శాతం పైనే!