ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులో చోరీ జరిగింది. సహకార బ్యాంకు లాకర్లో 61 గ్రాముల బంగారం మాయం కలకలం రేపింది. గుడివాడ రాజేంద్రనగర్కు చెందిన గుత్తా విజయలక్ష్మి.. తన తండ్రి కొల్లి నాగేశ్వరరావు కలిసి.. వేలేరు కోఆపరేటివ్ బ్యాంకు లాకర్లో బంగారాన్ని దాచుకున్నారు.
బ్యాంక్లాకర్లో బంగారం మాయం.. ఎలా జరిగిందంటే.. - కృష్ణాజిల్లాలో సహకార బ్యాంకులో చోరి
ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులోని సహకార బ్యాంకులో చోరీ కలకలం రేపింది. బ్యాంకు లాకర్లో 61గ్రాముల బంగారాన్ని దాచి పెట్టింది రాజేంద్రనగర్కు చెందిన విజయలక్ష్మి. అయితే బ్యాంకు ఉద్యోగితో చేయి కలిపిన విజయలక్ష్మి కుమారుడు.. ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
![బ్యాంక్లాకర్లో బంగారం మాయం.. ఎలా జరిగిందంటే.. బ్యాంకులో తల్లి దాచిన బంగారాన్ని అపహరించిన తనయుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10006711-1108-10006711-1608905056070.jpg)
బ్యాంకు సిబ్బంది యార్లగడ్డ మదన్మోహన్తో చేతులు కలిపిన విజయలక్ష్మి కుమారుడు గుత్తా సాయిహిరన్ చౌదరి.. తాత నాగేశ్వరరావు నుంచి దొడ్డిదారిలో తీసుకున్న తాళంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తల్లి విజయలక్ష్మికి తెలియకుండా లాకర్లోని బంగారాన్ని కాజేశాడు. దీనిపై విజయలక్ష్మి హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాయిహిరన్ చౌదరి ముత్తూట్లో తనఖా పెట్టి కొంత మొత్తాన్ని జల్సాలకు ఖర్చు చేసినట్లు గుర్తించారు. తనయుడితో పాటు బ్యాంకు ఉద్యోగి మదన్మోహన్ను అరెస్టు చేసి బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.