తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓ ఇంట్లో చోరీ.. మూడు తులాల బంగారం అపహరణ

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పరిధిలోని రెడ్డిబజార్​లో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి మూడు తులాల బంగారం అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Sep 12, 2020, 10:58 PM IST

30 grams gold theft in a house at suryapet district
ఓ ఇంట్లో చోరీ.. మూడు తులాల బంగారం అపహరణ

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి బజార్​లో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమానులు బెంగళూరు వెళ్లారు. ఈ విషయాన్ని పసిగట్టిన గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి మూడు తులాల బంగారం అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు.

దొంగతనం జరిగిందని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై అనిల్​రెడ్డి తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details