తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2020, 10:08 AM IST

ETV Bharat / jagte-raho

మద్యం దుకాణంలో చోరీ..

ఇల్లందులోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుండగులు రూ. 20 వేల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Theft at a liquor store at illandu
మద్యం దుకాణంలో చోరీ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఏడో నెంబర్ మద్యం దుకాణంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగతనం జరిగిన విషయాన్ని రాత్రి గమనించిన దుకాణదారుడు ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 వేల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details