తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పదో తరగతి విద్యార్థి దారుణ హత్య - పదో తరగతి విద్యార్థి దారుణ హత్య వార్తలు

కాగజ్​నగర్​ సర్దార్​ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The brutal murder of a tenth grade student
పదో తరగతి విద్యార్థి దారుణ హత్య

By

Published : Apr 26, 2020, 1:58 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో పదో తరగతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని సర్దార్​ బస్తీకి చెందిన జశ్వంత్​ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు.

జశ్వంత్​ తల్లిదండ్రులు సిర్పూర్​(టి)లో ఉంటున్నారు. జశ్వంత్​ సర్దార్​ బస్తీలోని నానమ్మ సుమిత్ర వద్ద ఉంటూ.. స్థానిక వింగ్స్​ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవలే పది పరీక్షలకు హాజరయ్యాడు.

శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన జశ్వంత్.. మళ్లీ తిరిగి రాలేదని నానమ్మ తెలిపారు. మనవడి కోసం బయటకు వెళ్లి చూడగా.. రోడ్డుపై రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నాడని సుమిత్ర పేర్కొన్నారు. స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించేలోపే జశ్వంత్​ మృతి చెందాడని ఆమె కన్నీటి పర్యంత మయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పదో తరగతి విద్యార్థి దారుణ హత్య

ఇదీ చదవండి:ప్రపంచంపై 'కరోనా' కరాళ నృత్యం.. 2 లక్షలు దాటిన మృతులు

ABOUT THE AUTHOR

...view details