తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెన్​గంగాలో నాటు పడవ బోల్తా.. తప్పిన ప్రమాదం - పెన్​గంగాలో నాటు పడవ బోల్తా

ఆదిలాబాద్​ జిల్లాలోని పెన్​గంగా నదిలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 8 మంది మహిళలు ఉండగా.. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

The boat rolling in PenGanga in adilabad district
పెన్​గంగాలో నాటు పడవ బోల్తా.. తప్పిన ప్రమాదం

By

Published : Jun 20, 2020, 1:48 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ సమీపంలోని పెన్​గంగా నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఘటనలో 8 మంది మహిళలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

మండలంలోని దనోరా, గోముత్రి గ్రామాలకు చెందిన 8 మంది మహిళలు.. మహారాష్ట్రలోని సగదా గ్రామంలో బంధువు అంత్యక్రియలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొద్ది నిమిషాల్లో ఒడ్డుకు చేరే సమయంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఫలితంగా మహిళలు భయంతో కేకలు వేయటం వల్ల అప్రమత్తమైన పడవ నడిపే గంగపుత్రులు.. వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణించటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని గంగపుత్రులు తెలిపారు.

ఇదీచూడండి: కొట్టేసిన కారు... ముళ్ల పొదల్లో ప్రత్యక్షం..

ABOUT THE AUTHOR

...view details