లంచం డిమాండ్ చేస్తూ మరో అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. భూవివాదానికి సంబంధించి.. రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య.. లక్ష 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. ఓ భూవివాదం కేసులో సీఐ శంకరయ్యతోపాటు ఏఎస్ఐ... లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. అనంతరం షాబాద్ పోలీస్స్టేషన్లో సోదాలు నిర్వహించారు. గతంలో షాద్నగర్, దుండిగల్లో పనిచేసినప్పుడు కూడా శంకరయ్య పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అ.ని.శా. వలలో చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్ఐ - rangareddy district news
అ.ని.శా. వలలో చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్ఐ
11:37 July 09
అ.ని.శా. వలలో చిక్కిన షాబాద్ సీఐ, ఏఎస్ఐ
Last Updated : Jul 9, 2020, 1:43 PM IST