తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వేద పాఠశాలలో గురువు మందలించారని విద్యార్థి ఆత్మహత్య - తెలంగాణ తాజా వార్తలు

వేదాలు నేర్చుకుని ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వేద పాఠశాలలో గురువు మందలించారనే కారణంతో కాలువలో దూకాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

Student commits suicide after teacher reprimands him at rayamadharam khammam district
గురువు మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

By

Published : Jan 3, 2021, 3:43 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయ మాధారంలో వేద పాఠశాల విద్యార్థి గురువు మందలించాడనే కారణంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం రేఖపల్లికి చెందిన యామిని శేషు(18).. రెండేళ్లుగా రాయ మాధారంలోని ఓ వేద పాఠశాలలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 1న రాత్రి పాఠశాలలో చోటుచేసుకున్న ఓ సంఘటనపై గురువు మందలించాడు.

మనస్తాపం చెందిన ఆ విద్యార్థి పాఠశాల సమీపంలోని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలో దూకిన శేషు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మారావుపేట సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :దొంగతనం చేస్తుండగా దొరికిపోయారు.!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details