తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2021, 3:43 PM IST

ETV Bharat / jagte-raho

వేద పాఠశాలలో గురువు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

వేదాలు నేర్చుకుని ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వేద పాఠశాలలో గురువు మందలించారనే కారణంతో కాలువలో దూకాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

Student commits suicide after teacher reprimands him at rayamadharam khammam district
గురువు మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయ మాధారంలో వేద పాఠశాల విద్యార్థి గురువు మందలించాడనే కారణంతో కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం రేఖపల్లికి చెందిన యామిని శేషు(18).. రెండేళ్లుగా రాయ మాధారంలోని ఓ వేద పాఠశాలలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 1న రాత్రి పాఠశాలలో చోటుచేసుకున్న ఓ సంఘటనపై గురువు మందలించాడు.

మనస్తాపం చెందిన ఆ విద్యార్థి పాఠశాల సమీపంలోని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలో దూకిన శేషు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మారావుపేట సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :దొంగతనం చేస్తుండగా దొరికిపోయారు.!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details