తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నకిలీ బంగారం అమ్మాలని చూశారు.. పోలీసులకు చిక్కారు - నకిలీ బంగారం విక్రయానికి ప్రయత్నించిన దంపతులు

నకిలీ బంగారం విక్రయించేందుకు ప్రయత్నించిన దంపతులను యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగుతూ కంది, పెసర, మినపప్పు అమ్ముతుండేవారని పోలీసులు వెల్లడించారు.

spouses try to sell guilt gold in anajipur and caught by police
నకిలీ బంగారం అమ్మాలని చూశారు.. పోలీసులకు చిక్కారు

By

Published : Oct 20, 2020, 5:25 PM IST

కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, తిరుమల భార్య భర్తలు. వీరు ఆరు నెలలుగా తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట, వలిగొండ, భువనగిరి ప్రాంతాల్లో తిరుగుతూ రెండు మూడు రోజుల పాటు కంది, పెసర, మినప్పప్పు అమ్ముతూ... తిరిగి ఊరికి వెళ్లిపోయేవారు. ఆ క్రమంలో భువనగిరి మండలం అనాజీపురంలో టిఫిన్ తినేవారు. అలా హోటల్ యజమని ఐలయ్యతో పరిచయం పెంచుకున్న దంపతులు, 2 రోజుల క్రితం... తమ వద్ద బంగారు ఒడ్డాణం ఉందని, డబ్బులు అవసరం ఉండి రూ.25 వేలకే అమ్ముతామని ఐలయ్యకు చెప్పారు. తనకు అవసరం లేదని, తన తమ్ముని ఇంట్లో పెళ్లి ఉందని అతన్ని పిలిపించాడు.

ఐలయ్య తమ్ముడు శ్రీను... దంపతులకు వెయ్యి రూపాయలు అడ్వాన్స్​గా ఇచ్చి, ఒడ్డాణంలోని చిన్న ముక్కను తీసుకున్నాడు. కంసాలి వద్ద పరీక్షించిన తరువాత మొత్తం డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. కంసాలి పరీక్షిస్తే అది నకిలీ బంగారమని తేలిపోతుందని భయపడి అక్కడి నుంచి దంపతులిద్దరూ జారుకున్నారు. బాధితులకు అది నకిలీ బంగారం అని తెలిసి... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ రోజు దంపతులిద్దరినీ భువనగిరి మండలం రాయగిరి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వెయ్యి రూపాయల నగదు ఇత్తడి ఒడ్డాణం, టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనం స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ భుజంగరావు వెల్లడించారు. గతంలో వీరు ఏపీలోని చీరాల ఓడరేవు వద్ద ఓ వ్యక్తిని కొట్టి, డబ్బులు లాకున్న ఘటనలో దంపతులిద్దరూ నిందితులని, జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు తెలిపారు.

ఇదీ చూడండి:గుంటూరులో రూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details