తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిల్లర్ అల్లుడు.. ఆస్తి కోసం అత్తామామలను చంపేశాడు..

ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం కన్న కూతురు, అల్లడు కలిసి దారుణానికి పాల్పడ్డారు.

By

Published : Dec 16, 2020, 9:42 AM IST

Updated : Dec 16, 2020, 11:40 AM IST

కిల్లర్ అల్లుడు.. ఆస్తి కోసం అత్తామామలను చంపేశాడు..
కిల్లర్ అల్లుడు.. ఆస్తి కోసం అత్తామామలను చంపేశాడు..

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ వాలంటీర్​గా నెమలి బాబురావు విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామంలో నివసిస్తున్న అత్తామామలు కోటా ముత్తయ్య(65), సుగుణమ్మ(60) దంపతులతో ఆస్తి వివాదం నడుస్తోంది. కొంత కాలంగా బాబూరావు వేధిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి కత్తితో అత్తామామలపై దాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Last Updated : Dec 16, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details