తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెచ్చిపోయిన అల్లరిమూకలు... కత్తులతో స్వైరవిహారం - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

రాజేంద్రనగర్​లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. అర్ధరాత్రి కత్తులతో కొందరు సిక్కు యువకులు స్వైర విహారం చేశారు. స్థానికులను దూషించడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫలితంగా ఘర్షణ వాతావారణం నెలకొంది.

sikhs-conflict-at-rajendra-nagar-in-hyderabad
రెచ్చిపోయిన అల్లరిమూకలు... కత్తులతో స్వైరవిహారం

By

Published : Dec 2, 2020, 11:19 AM IST

Updated : Dec 2, 2020, 2:17 PM IST

రాజేంద్రనగర్‌లో అల్లరిమూకలు అర్ధరాత్రి రెచ్చిపోయాయి. కొందరు సిక్కు యువకులు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అత్తాపూర్‌లోని మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పోయేవారిని దూషించారు. ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిక్కు యువకులు కత్తులు పట్టుకుని తిరిగారు.

రెచ్చిపోయిన అల్లరిమూకలు... కత్తులతో స్వైరవిహారం

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అల్లరి మూకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి:పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య

Last Updated : Dec 2, 2020, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details