తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గేటు మీద పడి సెక్యూరిటీ గార్డు మృతి - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరువు మండలం రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన గేటు మీద పడి సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. జిల్లాలోని రాజంపేటకు చెందిన మహబూబ్ అలీ బుధవారం తెల్లవారుజామున గేటును జరుపుతుండగా ప్రమాదం జరిగింది.

Security guard in  sangareddy dist in Toshiba industry
గేటు మీద పడి సెక్యూరిటీ గార్డు మృతి

By

Published : Oct 28, 2020, 2:52 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరువు మండలం రుద్రారం గ్రామ శివారులోని తోషిబా పరిశ్రమలో గేటు మీద పడడంతో సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. జిల్లాలోని రాజంపేటకు చెందిన మహబూబ్ అలీ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన గేటును జరుపుతుండగా బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది.

తీవ్ర గాయాల పాలైన అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ కలకలం

ABOUT THE AUTHOR

...view details