తెలంగాణ

telangana

అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం

By

Published : Oct 10, 2020, 12:51 PM IST

వరంగల్​ నగరంలో అక్రమ ఇసుక రవాణాలు పెరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ జిల్లా నుంచి నగరానికి ఇసుకని తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

sand illegal transportation to warangal city from warangal rural district
అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం

వరంగల్​ నగరానికి ఇసుక తరలిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎనుమాముల వద్ద చేసిన తనిఖీలో ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. మిల్స్ కాలనీ సీఐ రవి కిరణ్.. వర్ధన్నపేట వద్ద మరో 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

వర్ధన్నపేట ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపులు పెరగడమే గాక. గ్రామీణ జిల్లా నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తుండటంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్​ నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:భాగ్యనగరం అతలాకుతలం... లోతట్టు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details