తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గ్రేటర్​లో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలు సీజ్​

జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలను సీజ్​ చేసినట్లు రాష్ట్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. పలు పార్టీలు అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులను తొలగించేందుకు జీహెచ్​ఎంసీ 20 బృందాలను ఏర్పాటు చేసింది.

By

Published : Nov 21, 2020, 7:15 PM IST

Rs.one crore 35 lakhs rupees seized so far in Greater hyderabad
గ్రేటర్​లో ఇప్పటివరకు రూ.కోటి 35లక్షలు సీజ్​

గ్రేటర్ హైదరాబాద్​లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇవాళ్టి వరకు జంట నగరాల్లో అనధికారికంగా తరలిస్తున్న రూ.కోటి 35 లక్షలను సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటివరకు 10 లక్షల విలువైన గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈసీ అధికారులు వెల్లడించారు.

ఇక గ్రేటర్​లో పలు పార్టీలు అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ 20 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జంట నగరాల్లో తిరుగుతూ ఇప్పటి వరకు పలు పార్టీలకు చెందిన 15 వేల 914 ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.

ఇవీ చూడండి: రెండోరోజూ సీఐ జగదీశ్​ ఇంట్లో ఏసీబీ సోదాలు

ABOUT THE AUTHOR

...view details