తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనం, కారు ఢీ.. ఒకరు మృతి - తెలంగాణ క్రైమ్ న్యూస్

మహబూబ్‌నగర్ జిల్లా ఓబులయాపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ని కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

road accident in mahaboobnagar district obulayapally
ఓబులయాపల్లి శివారులో రోడ్డు ప్రమాదం

By

Published : Dec 23, 2020, 10:30 PM IST

మహబూబ్ నగర్ గ్రామీణ మండలం ఓబులయాపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతన్ పల్లి గ్రామానికి చెందిన కనకన్న పొలం పనులు పూర్తి చేసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణమవుతూ .. తన మోటర్‌ సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కనకన్న (47) అక్కడికక్కడే మృతి చెందాడు.

గమనించకపోవడంతోనే..

మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న కారు కనకన్న బైక్‌ని ఢీ కొట్టింది. రోడ్డు దాటుతుండటం.. కారు డ్రైవర్‌ గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు పేర్కొన్నారు. గ్రామ మత్స్యకార సంఘ సభ్యుడి వ్యవహరిస్తున్న మృతుడికి భార్యతో పాటు ..ఇద్దరు కూమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:'రాష్ట్రంలో కరోనా సెకండ్​ వేవ్​కు ఆస్కారం ఉండకపోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details