తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు యువకుల దుర్మరణం - గోవూరులో రోడ్డు ప్రమాదం వార్తలు

ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

road accident at govuru two died in nizamabad district
లారీ చక్రాల కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం

By

Published : Jul 2, 2020, 10:16 AM IST

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూరు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

గోవూరు గ్రామానికి చెందిన దండు సాయిలు, సుండు ప్రవీణ్​లు ద్విచక్ర వాహనంపై చందూరు నుంచి గోవూరు వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోకి రాగానే నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనక నుంచి వీరి బైకును ఢీకొట్టింది. ఫలితంగా ఇద్దరు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఒకే ఊరికి చెందిన ఇద్దరు చనిపోవడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లారీ చక్రాల కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం

ఇదీచూడండి: మద్యం మత్తులో గర్భవతి అయిన భార్యను కొట్టి చంపిన భర్త

ABOUT THE AUTHOR

...view details