తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కందకాన్ని పూడ్చి.. హద్దులు మార్చారు: డీఎఫ్​వో - అటవీ భూముల్లో అక్రమంగా కందకం

మెదక్ జిల్లా నర్సాపూర్​ మండలం లక్ష్మణ్ తండా సమీపంలో అటవీ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులు ఆపాలని డీఎఫ్​వో జ్ఞానేశ్వర్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

realters make a trench and occupy forest land in laxman thanda
కందకాన్ని పూడ్చి.. హద్దులు మార్చారు: డీఎఫ్​వో

By

Published : Nov 7, 2020, 1:17 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్​ మండలం లక్ష్మణ్ తండా సమీపంలో అటవీ భూముల్లో కందకం పూడ్చివేసి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై అధికారులు విచారణ చేపట్టారు. మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూముల్లో నుంచి చేపట్టిన రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఆ భూముల్లోకి ఎవరూ ప్రవేశించకుండా... అధికారులు కందకం తవ్వారు. కందకంపైనే గచ్చకాయ మొక్కలు కూడా ఉన్నాయి.

అటవీ భూములను ఆనుకొని ఉన్న కొన్ని వందల ఎకరాల పట్టా భూములను హైదరాబాద్​కు చెందిన స్థిరాస్తి వ్యాపారులు కొలుగోలు చేశారు. భూముల విలువ పెంచుకునేందుకు అటవీశాఖ తవ్వించిన కందకాన్ని పూడ్చి... దానికి 20 మీటర్ల దూరంలో కొత్తగా తవ్వించారని స్థానికులు ఆరోపించారు. అటవీ హద్దులను కూడా మార్చేసి కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణం చేపట్టారని ఫిర్యాదు చేయగా అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.

రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన ఇంఛార్జ్​ డీఎఫ్‌వో ఙ్ఞానేశ్వర్‌... కందకాన్ని పూడ్చివేసి హద్దురాళ్లు మార్చినట్టు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొన్నిచోట్ల అటవీ సంపదను ధ్వంసం చేయడాన్ని గమనించారు. అటవీ హద్దులను జీయోట్యాగింగ్‌ చేయడం వల్ల వాటిని మరో చోటికి మారిస్తే గుర్తించవచ్చని, రెవెన్యూ శాఖతో కలసి సర్వే చేయిస్తామన్నారు. రోడ్డు పనులు నిలిపివేయించాలని అధికారులకు సూచించారు. డీఎఫ్​వో వెంట అటవీక్షేత్రాధికారి అంబర్‌సింగ్‌, సెక్షన్‌అధికారులు బాలేష్‌, రాములు, ఎంపీటీసీ సభ్యుడు అంజనేయులుగౌడ్‌ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి:ప్రారంభానికి సిద్ధమవుతున్న బుద్ధవనం.. 15లోగా పనులు పూర్తి!

ABOUT THE AUTHOR

...view details