తెలంగాణ

telangana

By

Published : Sep 6, 2020, 10:11 AM IST

ETV Bharat / jagte-raho

డివైడర్​ను ఢీకొట్టిన బైక్​.. ఓ వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా జగంపల్లి ఆర్టీఏ చెక్​పోస్ట్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనదారు డివైడర్ ఢీకొని మృతి చెందాడు.​

raod-accident-at-jaganpally-rta-checkpost-in-kamareddy-district-one-person-dead
డివైడర్​ను ఢీకొట్టిన బైక్​.. ఓ వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం జగంపల్లి శివారులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనం డివైడర్​కు ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ద్విచక్ర వాహనదారుని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

మృతుడు కామారెడ్డి జిల్లా సీపీఐయం కార్యదర్శి రాజలింగంగా పోలీసులు గుర్తించారు. రాజలింగం శనివారం రాత్రి 10 గంటల సమయంలో పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై బీబీపేటలోని తన ఇంటికి బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం సంభవించినట్టు పేర్కొన్నారు.

ఇవీచూడండి:అమానుషం... భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

ABOUT THE AUTHOR

...view details