తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2021, 6:12 PM IST

ETV Bharat / jagte-raho

కోడి పందాల స్థావరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్​

మంచిర్యాల జిల్లా ముల్కల్లో కోడి పందాల స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. టవేరా వాహనం, 15వేల నగదు, రెండు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హెచ్చరించారు.

Task force police raids on henfights betting base
కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లో చెట్ల పొదల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి టవేరా వాహనం, రూ.15వేలు, రెండు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలతో దాడులు జరిపారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలను అరికట్టడానికి ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'బుల్లెట్ సైలెన్సర్ మార్చారో.. మీ బైక్ స్టేషన్​కే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details