సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్యాగమలో ఈరారెడ్డి అనే రైతుకు 8 ఎకరాల పొలం ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి రాయితీ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. అధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఇక తనకు డబ్బులు రావని మనస్తాపానికి గురైన ఈరారెడ్డి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు.
ఈ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు.