తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పరిహారం చెల్లించాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని డెక్కన్ సిమెంట్స్​ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. లారీ ఢీకొట్టడం వల్ల గాయాలైన బాధితుడికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు.

By

Published : Dec 4, 2020, 5:34 PM IST

protest at deccan cements company in suryapet district
పరిహారం చెల్లించాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

సూర్యాపేట జిల్లా మహంకాళిగూడెంనకు చెందిన వేముల వెంకట్రావు అనే వ్యక్తిని డెక్కన్​ సిమెంట్స్​ యాజమాన్యానికి చెందిన లారీ రెండు రోజుల క్రితం ఢీకొట్టింది. ఘటనలో వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాధితుడిని హైదరాబాద్​కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగి రెండు రోజులైనా డెక్కన్​ సిమెంట్స్​ యాజమాన్యం స్పందించకపోవడం వల్ల కుటుంబ సభ్యులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుడికి పరిహారం చెల్లించాలంటూ డిమాండ్​ చేశారు.

  • భార్యాపిల్లలను చూసేందుకు వచ్చి..

వెంకట్రావు దాచేపల్లిలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యా, పిల్లలు మహంకాళిగూడెంలో ఉంటున్నారు. ఈ క్రమంలో వారిని చూసి వెళ్లేందుకని రాగా.. ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు లారీకింద పడి డ్రైవర్ మృతి

ABOUT THE AUTHOR

...view details