తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తల్లికి మాయమాటలు చెప్పి కూతుర్ని కిడ్నాప్​ చేశారు.. - యాదాద్రి జిల్లా తాజా వార్తలు

యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లికి మాయమాటలు చెప్పి.. శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి.. చిన్నారిని అపహరించారు. భర్త ఆచూకీ కోసం మహబూబ్​నగర్​కు చెందిన మహిళ హైదరాబాద్​ వెళ్లగా.. పాప కిడ్నాప్​ అయింది. బాలికను అపహరించిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

తల్లికి మాయమాటలు చెప్పి కూతుర్ని కిడ్నాప్​ చేశారు
తల్లికి మాయమాటలు చెప్పి కూతుర్ని కిడ్నాప్​ చేశారు

By

Published : Oct 20, 2020, 10:43 AM IST

మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు హైదరాబాద్ వెళ్లాడు. నాలుగు రోజులైనా భర్త తిరిగి రాకపోవడం వల్ల భార్య మహేశ్వరి ఆందోళనకు గురయింది. దీంతో ఆమె భర్తను వెతుక్కుంటూ.. మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకని సోమవారం హైదరాబాద్​ వెళ్లింది.

తల్లికి మాయమాటలు చెప్పి కూతుర్ని కిడ్నాప్​ చేశారు

హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్​లో తన భర్త దగ్గరకు తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి ఓ ముఠా ఆమెను తన కూతుర్ని భువనగిరికి తీసుకొచ్చారు. భువనగిరి బస్టాండ్​లో ఇద్దరు నిందితులకు మరో మహిళ చేరి.. మహేశ్వరి కూల్ డ్రింక్​లో మత్తు మందు కలిపింది. ఆమె స్పృహ కోల్పోయాక.. పాపను కిడ్నాప్ చేశారు.

తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన బాధితురాలు మహేశ్వరి పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. భువనగిరి పట్టణ పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉండగా.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:లైవ్​ వీడియో: బాలుడు అపహరణ!.. కిడ్నాపర్​కు దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details