తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్​ కేసును ఛేదించిన పోలీసులు - నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్​ కేసు

భాగ్యనగరంలో ఈ నెల 22న కిడ్నాప్​కు గురైన బాలుడి కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని... బాలుడి తన తల్లికి అప్పగించారు.

Hyderabad  South Zone Task Force police latest news
Hyderabad South Zone Task Force police latest news

By

Published : May 24, 2020, 11:23 PM IST

హైదరాబాద్​లో ఈనెల 22న కిడ్నాప్​కు గురైన నాలుగేళ్ల బాలుడి కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. క్షేమంగా షేక్ అబ్దుల్ వహాబ్​ని తన తల్లికి అప్పగించి... నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్​ అధికారులు తెలిపారు.

భాగ్యనగరంలోని పాతబస్తి ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన ఓ మహిళ వైద్యం కోసం తన చిన్నారితో కలిసి జహనుమా ప్రాంతములోని ప్రైవేట్​ క్లీనిక్​కి వెళ్లింది. మహిళ క్లినిక్​లో ఉండగా చిన్నారి ఆసుపత్రి బయట ఆడుకుంటున్నాడు. కొద్ది సమయం తర్వాత తల్లి బయటికి వచ్చి చూస్తే చిన్నారి కనిపించలేదు. వెంటనే చుట్టు పక్కన ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపొవడం వల్ల పోలీసులను ఆశ్రయించారు.

సౌత్​జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్​ బృందం విచారణ చేపట్టింది. దూద్​బౌలి ప్రాంతానికి చెందిన భిక్షాటన చేసే సమ్రీన్(45) అనే మహిళ ఈ చర్యకి పాల్పడిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారిని క్షేమంగా రక్షించారు.

తన పెద్ద కూతురికి వివాహం చేసి 9 ఏళ్లైనా పిల్లలు పుట్టకపొవడం వల్ల నిందితురాలు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం కిడ్నాప్​కు పాల్పడిన మహిళను ఫలక్ నుమా పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details