తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై దాడి సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. అదుపులో నలుగురు - people arrested in Hyderabad fast-food center attack

హైదరాబాద్​ రాంనగర్​ సమీపంలోని ఫాస్ట్​ఫుడ్ సెంటర్​పై దాడి చేసిన 12 మందిలో నలుగురిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు.

Hyderabad fast-food center attack
ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై దాడి సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. అదుపులోకి నలుగురు

By

Published : Oct 2, 2020, 12:30 PM IST

హైదరాబాద్​ రాంనగర్​లోని స్పైసీ ఫుడ్​ కోర్టు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై దాడి కేసులో నలుగురిని చిక్కడిపల్లి పోలీసులు గుర్తించారు. గత నెల 28న కొందరు వ్యక్తులు, యువకులు ఫుడ్​ కోసం వచ్చి మెను విషయంలో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ దృష్టిలో పెట్టుకుని.. తన అనుచరులతో కలిసి ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై దాడితో పాటు యజమానిపైనా దాడికి పాల్పడ్డారు.

ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై దాడి సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. అదుపులోకి నలుగురు

ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. విచారణ చేపట్టిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజీ ద్వారా దాడి చేసిన సుమన్, శ్రీకాంత్, మహేందర్​, జయకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండిఃఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details