తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోలీసుల అదుపులో ఎల్లమ్మ ఆలయం చోరీ నిందితుడు - రాజన్న సిరిసిల్లా జిల్లా నేరవార్తలు

కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వరంగల్​ జిల్లా మంగపేటకు చెందిన ఓ పాత నేరస్థుడి హస్తముందని నిర్ధారించిన పోలీసులు.. అతడి సన్నిహితులపై నిఘా పెట్టి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

rajanna siricilla news
పోలీసులు అదుపులో ఎల్లమ్మ ఆలయంలో చోరీ నిందితుడు!

By

Published : Jan 13, 2021, 12:02 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు.

కొదురుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఆదివారం రాత్రి ఎల్లమ్మ ఆలయం తాళాలు పగులగొట్టి... అమ్మవారికి ఆలంకరించిన ఆభరణాలు, హుండీలోని నగదును కాజేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు. నేర పరిశోధనకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్​వేర్​ ద్వారా ఆధారాలను విశ్లేషించారు.

వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన ఓ పాత నేరస్థుడే ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందం వరంగల్​కు వెళ్లింది. నిందితుడు చరవాణి వినియోగించకపోవడం వల్ల.. కదలికలు తెలుసుకోవడం కష్టంగా మారింది. అతని సన్నిహితులపై నిఘా పెట్టి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇవీచూడండి:ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.. ఆభరణాలు మాయం

ABOUT THE AUTHOR

...view details