రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు.
కొదురుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ఆదివారం రాత్రి ఎల్లమ్మ ఆలయం తాళాలు పగులగొట్టి... అమ్మవారికి ఆలంకరించిన ఆభరణాలు, హుండీలోని నగదును కాజేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నేర పరిశోధనకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆధారాలను విశ్లేషించారు.