తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

క్రికెట్ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్టు.. నగదు స్వాధీనం

ఆన్​లైన్​ ద్వారా క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేసిన పోలీసులు నిందితుల నుంచి.. ల్యాప్​టాప్​, సెల్​ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Oct 4, 2020, 8:53 PM IST

Police Arrest Online Betting Team in kphb
క్రికెట్ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్టు.. నగదు స్వాధీనం

ఆన్​లైన్​లో ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జయభారత్​ నగర్​లో ఆన్​లైన్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి.. నిందితులను అరెస్టు చేశారు.

డఫ్పా బైట్​ ఆన్​లైన్​ యాప్​ ద్వారా ఆచంట వెంకట కృష్ణప్రసాద్, యాడిదల శ్రీను వెంకటేశ్వర రావు.. ల్యాప్​టాప్​ ద్వారా బెట్టింగ్​ నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడిలో రెడ్​హ్యాండెడ్​గా దొరికిన వీరివద్ద ల్యాప్​టాప్​, 3 ఫోన్లు, రూ.84 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:హోం మంత్రి సమక్షంలోనే తెరాస నేతల బాహాబాహీ

ABOUT THE AUTHOR

...view details