తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తుమ్మలపల్లి వద్ద కారు బోల్తా.. ఇద్దరు మృతి - road accident news

రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోని తుమ్మలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఏపీలోని ప్రకాశం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

road accident in khammam district two people died and one person severely injured
తుమ్మలపల్లి వద్ద కారు బోల్తా.. ఇద్దుర మృతి

By

Published : Dec 16, 2020, 10:04 AM IST

Updated : Dec 16, 2020, 2:01 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లికి చెందిన చల్లా మల్లికార్జున్​రెడ్డి(25), ఎర్రవారిపల్లికి చెందిన ఆదిలక్ష్మీ(32).. ఒడిశాలో బొంగు పేలాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన వీరు.. సొంత ఊరు నుంచి ఒడిశాకు కారులో బయలుదేరారు. తుమ్మలపల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో నాలుగేళ్ల చిన్నారి నవ్యకి తీవ్రగాయాలవ్వగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

ఇవీ చూడండి:ఇంజినీరింగ్ ప్రొఫెసర్... ఏకంగా 15 సార్లు ఓటీపీ చెప్పిన వైనం

Last Updated : Dec 16, 2020, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details