హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు ఘాట్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే వారిపైనా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ హోంగార్డు గాయపడ్డాడు. అతన్ని లంగర్ హౌస్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఓ కేసుకు విషయంలో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ: హోంగార్డుకు గాయాలు - లంగర్ హౌస్ హోంగార్డు పై దాడి
హైదరాబాద్ లంగర్ హౌస్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్ఘణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే వారిపై కూడా దాడికి పాల్పడ్డారు.
![ఇరువర్గాల మధ్య ఘర్షణ: హోంగార్డుకు గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3068922-thumbnail-3x2-att.jpg)
బాపు ఘాట్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ