వేటగాళ్ల విష ప్రయోగానికి 8 నెమళ్లు బలైన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లోని ఆర్కే-5 సింగరేణి గని సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారించగా... విషం కలిపిన వడ్ల గింజలు తిన్నట్టు వెల్లడైంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
విష ప్రయోగం.. ఎనిమిది నెమళ్లు మృతి - శ్రీరాంపూర్లో నెమళ్ల మృతి
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లో 8 నెమళ్లు మృతి చెందాయి. వేటగాళ్ల విష ప్రయోగం వల్లే ఘటన చోటుచేసుకున్నట్టు అటవీ అధికారుల విచారణలో వెల్లడైంది.

విష ప్రయోగం.. ఎనిమిది నెమళ్లు మృతి
Last Updated : May 26, 2020, 12:19 PM IST